Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు..

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (10:50 IST)
ఆడపిల్ల పుట్టిందని.. భర్త ముఖం చాటేశాడు. రెండో పెళ్లి చేసేసుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్‌తో 2014లో వివాహం జరిగింది. 
 
వివాహం సమయంలో అమ్మాయి తరపు వారు నాలుగు లక్షల కట్నం ఇచ్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక, లాస్యకు పాప పుట్టాక శివశంకర్ అసలు స్వరూపం బయటపడింది. అమ్మాయి పుట్టిందని లాస్యను అదనపు కట్నం తెమ్మని వేధించాడు. భర్త శివశంకర్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో  లాస్య పుట్టింటికి వచ్చింది. 
 
అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. చివరికి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments