Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటకులకు శుభవార్త : చెన్నై - విశాఖ - పుదుచ్చేరిల మధ్య క్రూయిజ్ నౌక

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (12:43 IST)
సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని భావించే పర్యాటకుల కోసం శుభవార్త. చెన్నై, విశాఖపట్టణం, పుదుచ్చేరిల మధ్య జూన్, జూలై నెలలో క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు విశాఖలో బుధవారం నిర్వహించిన ట్రావెల్ ఏజెంట్ల  సమావేశంలో నిర్వాహకులు కార్డెల్లా క్రూయిజ్ నౌక ప్రయాణ వివరాలను వెల్లడించారు. 
 
మూడు సర్వీసుల్లో భాగంగా తొలిసారి జూన్ 30వ తేదీన చెన్నైలో బయలుదేరి జూన్ 2వ తేదీన విశాఖ హార్బరుకు చేరుకుంటుంది. అదే రోజు అక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి వెళుతుంది. 4వ తేదీన పుదుచ్చేరిలో బయలుదేరి 5వ తేదీన చెన్నైకు వస్తుంది. రెండో సర్వీసుగా జూలై 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 9వ తేదీన విశాఖకు, 11వ తేదీన పుదుచ్చేరి అక్కడ నుంచి 12వ తేదీన చెన్నైకు చేరుకుంటుంది. 
 
మూడో సర్వీసుగా జూలై 14వ తేదీన చెన్నై హార్బరులో బయలుదేరి 16వ తేదీన విశాఖకు, అక్కడ నుంచి 18వ తేదీన పుదుచ్చేరి చేరుకుని 19వ తేదీన చెన్నైకి చేరుతుంది. అతిపెద్ద క్రూయిజ్ నౌకలో ప్రయాణం చేసేందుకు అనేక మంది పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో విశాఖ తీరానికి చేరుకున్న క్రూయిజ్ నౌకలను చూసేందుకు పర్యాటకు భారీ సంఖ్యలో తరలివచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments