Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుగ్గనపై పరువు నష్టం దావా : రావెల

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:44 IST)
తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై పరువు నష్టం దావా కేసు వేస్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తెలిపారు. ఆయనపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మీడియా ముఖంగా రావెల స్పష్టం చేశారు.

విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘బుగ్గనపై పరువు నష్టం కేసుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. రాజధాని అనేది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేది. అలాంటి రాజధానిని తరలింపు విషయంలో ప్రజల పక్షాన పోరాడుతుంది .

నా నోటీస్ అందిన తర్వాత అయిన బుగ్గన రాజేంద్ర బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయి’ అని రావెల చెప్పుకొచ్చారు. ‘రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో నాకు భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారు.

నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. కుటుంబ పోషణ కష్టతరంగ ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఖండిస్తున్నాను. ఒక దళిత నాయకుడిగా స్వయంకృషితో ఎదిగిన నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు..?

రాజధాని ఆంధ్రప్రదేశ్ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ప్రాజెక్ట్. ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాజధానిని నాశనం చేస్తోంది’ అని మాజీ మంత్రి రావెల ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments