Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వలేదనీ... మహిళపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 24 మే 2020 (12:00 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ దొంగ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి కారణం.. బాధిత మహిళ ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకపోవడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తమ ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ వాడుతోంది. అదేసమయంలో ఓ 23 యేళ్ల కుర్రాడు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలో చొరబడ్డాడు. ఈ విషయం గ్రహించిన ఆ మహిళ.. ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. 
 
ఆ దొంగ కత్తితో చంపుతానని బెదిరించడంతో మహిళ మిన్నకుండిపోయింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు తనకు అప్పగించాలని ఆమెను బెదిరించాడు. ఆపై ఆమె బ్యాంకు ఏటీయం కార్డులు తీసుకొని వాటి పిన్ నంబర్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. 
 
అందుకు ఆ మహిళ నిరాకరించింది. అంతే.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. సదరు దొంగ తనపై అత్యాచారం చేయడమేకాకుండా, గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments