Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:55 IST)
దివంగత ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనడం సరికాదని స్వర్గీయ ఎన్టీఆర్ భార్య బసవతారకం స్నేహితురాలైన డాక్టర్ కుసుమ రావు చెప్పుకొచ్చారు. అందరూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని చెప్తూంటారనీ... నిజానికి వెన్నుపోటు పొడిపించుకున్నది చంద్రబాబేనని ఆవిడ తెలిపారు. అప్పట్లో తెదేపాకి ఛరిష్మా మొత్తం ఎన్టీఆరే అన్న మాట నిజమేననీ... కాకపోతే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే స్వయంగా చూసుకునేవారనీ... తెల్లవారుజామున 5 గంటలకల్లా చంద్రబాబు రాకపోతే ఆయనకు ఎన్టీఆర్ నుండి కబురు వచ్చేదన్నారు. ప్రభుత్వ పరంగా ఎదురయ్యే ఎన్నో క్లిష్టపరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించిన వ్యక్తి చంద్రబాబేనని చెప్పుకొచ్చిన ఆవిడ... ప్రతి కార్యకర్త పేరు చంద్రబాబుకు తెలుసునని చెప్పారు.
 
ఎన్టీఆర్‌కు ఏ ఆలోచన వస్తే అది జరిగిపోవాల్సిందేననీ... అయితే, తద్వారా ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా, చూసుకోవలసిన, సరిదిద్దవలసిన బాధ్యత చంద్రబాబుదేనని కుసుమ తెలిపారు. ఆ సమస్యలను ఎన్టీఆర్ పిల్లలు కానీ, మరో అల్లుడు కానీ సరిదిద్దే పరిస్థితే లేదని చెప్పారు. ఆ విధంగా అన్నీ తానై చంద్రబాబే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి చంద్రబాబును... లక్ష్మీపార్వతి సూచన మేరకు ఎన్టీఆర్ అన్ని పదవులకూ దూరంగా పెట్టారని... నిజంగా చెప్పాలంటే వెన్నుపోటుకు గురైంది చంద్రబాబేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments