Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాపచారం... దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం!! (video)

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (18:43 IST)
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఎక్కువైపోతోంది. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి. అంతర్వేది ఆలయ రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తలగబెట్టారు. ఇపుడు పవిత్ర కనకదుర్గ అమ్మవారి ఆలయం పాలక మండలి సభ్యురాలికి చెందిన కారులో అక్రమ మద్యం రవాణా జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సభ్యురాలు తన పదవికి రాజీనామా చేశారు. 
 
విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలిగ నాగవరలక్ష్మి ఉన్నారు. బుధవారం ఈమె కారులో మద్యం అక్రమ రవాణా జరిగిందని వార్తలు వచ్చాయి. దీంతో జగ్గయ్యపేటలో ఆ వాహనాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే వరలక్ష్మి కుమారుడు సూర్యప్రకాశ్‌ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు, డ్రైవర్‌ శివను అరెస్ట్‌ చేశారు. 
 
అయితే ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమె పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణాపై విచారణ ముగిసే వరకూ నైతికబాధ్యత వహించి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వరలక్ష్మి ఆలయ ఈవోకు, పాలకమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. మరోవైపు నాగవరలక్ష్మి రాజీనామాను ఆమోదించినట్లు దుర్గగుడి ఛైర్మన్‌ తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments