Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలో తొక్కిసలాట - 8కి చేరిన మృతుల సంఖ్య

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (09:56 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ పర్యటనలో భాగంగా, ఆయన బుధవారం రాత్రి కందుకూరులో రోడ్‌షోతో పాటు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. కందుకూరు ఆస్పత్రి నాలుగు రోడ్ల కూడలి కిక్కిరిసి పోయింది. ఆ సమయంలోనే అపశృతి చోటుచేసుకుంది. 
 
జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో అక్కడే ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే, మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో మర్లపాటి చినకొండయ్య, కాకుమాని రాజా, పురషోత్తం, కలవకూరి యానాది, దేవినేని రవీంద్రబాబు, యాటగిరి విజయ అనే వారు ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ, కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధఇరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారిని కూడా ఆదుకుంటామని వెల్లడించారు. 
 
తన 40 యేళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఎపుడు కందుకూరు వచ్చినా ఆస్పత్రి సెంటర్‌లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదని, దీన్ని సంతాప సభగా భావించి మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని తెలిపి, అదే విధంగా చేశారు. ఆ తర్వాత సభను అర్థాంతరంగా ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments