Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య చీఫ్ బీఎస్ రావుకు అదే ప్రేరణ.. చంద్రబాబు సంతాపం

Webdunia
గురువారం, 13 జులై 2023 (21:44 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు ఇకలేరు. బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు కనిపించకపోవడం.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచకపోవడంతోనే తాను శ్రీ చైతన్య విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రేరణగా నిలిచిందని ఆ సంస్థల అధినేత, బీఎస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం మంచి స్కూల్ వెతికతే కనబడలేదని.. ఆ క్రమంలోనే బాలికల కోసం.. ఇంటర్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించినట్లు తెలిపారు. అనతికాలంలోనే తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లలో మంచి మార్కులు వచ్చాయన్నారు. అలా స్థాపించిన శ్రీచైతన్య తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో పలు రాష్ట్రాలకు చేరిందన్నారు. 
 
ఇకపోతే.. బీఎస్ రావు మృతి పట్ల ప్రముఖ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి బీఎస్ రావు ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments