Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగమ్మాయి అత్యాచారం, హత్య: నిందితుడికి బాంబే హైకోర్టు మరణ శిక్ష

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:33 IST)
2015లో ముంబైలో అత్యాచారం, హత్యకు గురైన తెలుగు అమ్మాయి కేసులో దోషికి బాంబే హైకోర్టు మరణ దండన విధించింది. ఆ ఏడాది జనవరి 4న విశాఖ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వేకువజామున ముంబై చేరుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్య. ఆ సమయంలో స్టేషనులో వాహనాలు లేకపోవడంతో ఎదురుచూస్తూ వుంది. 
 
ఇంతలో చంద్రబాన్ అనే ఆగంతుకుడు వచ్చి తనకు రూ. 300 ఇస్తే గమ్య స్థానానికి చేర్చుతానని నమ్మబలికాడు. తొలుత ఆమె అతడి మాటలు నమ్మలేదు. కానీ వేరే వాహనాలు లేకపోవడంతో అయిష్టంగా అతడి ద్విచక్ర వాహనాన్ని ఎక్కింది. దాంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 
 
ఆనవాళ్లు కనబడకుండా వుండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆనాడు సంచలనం సృష్టించిన ఈ కేసులో సీసీ కెమేరాల సాయంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు సెషన్స్ కోర్టుకు రాగా ముద్దాయికి మరణ దండన విధించింది. దాంతో ఇతడు హైకోర్టుకు వచ్చాడు. విచారించిన హైకోర్టు, కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ మరణ శిక్షను ఖరారు చేసింది. కాగా అనూహ్య కుటుంబం స్వస్థంల కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments