Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి... కలెక్టర్ ఇంతియాజ్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:58 IST)
గుంటూరు జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ - 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో బుధవారం జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణాజిల్లా కలెక్టర్  ఏ.యండి. ఇంతియాజ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్థానిక వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, డీసిహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో- ఆర్దినేటర్ మోతి బాబు, తహశీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ యం సత్యనారాయణ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ చినబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments