Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తరపున పోటీ చేస్తున్న సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ??

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (12:04 IST)
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసి పదవీ విరమణ పొందిన వివి లక్ష్మీనారాయణ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతుంది. ఈ తరహా ప్రచారం సాగడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల వైకాపా ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని, అంగన్‌వాడీలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలు వైకాపా తరపున పోటీ చేయబోతున్నారనే  ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలతో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైకాపాలో చేరడం లేదని  స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments