Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ లేదా వైకాపాలో చేరిక?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేంద

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (08:26 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపినట్టు సమాచారం. ఈ చర్చలు ఫలప్రదం కానిపక్షంలో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచాం. ఏదిఏమైనా ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. 
 
కాగా, నాడు విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన, చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్న ఆయన తిరిగి రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఆయన అభిమానుల్లో ఆనందోత్సవాలను నింపుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments