Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (15:15 IST)
విజయవాడ గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో మరోమారు చుక్కెదురైంది. వంశీకి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని శుక్రవారం ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు.
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9వ తేదీ వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడగించడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్పీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ పిటిషన్‌‍పై శుక్రవారం సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత వెలువడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments