Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునే ఛాన్స్ : ఉండవల్లి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:11 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరం శంషాబాద్‌లో ఉన్న నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రాధాన్యం లేనిదే ఎన్టీఆర్‌తో అమిత్ షా అంత తీరికగా సమావేశమవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం వెనుక ఖచ్చితంగా రాజకీయం అంశం ఉండి వుంటుందన్నారు. ఒక్క తెలంగాణాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ వంటి మరికొందరిని బీజేపీ తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఈ తరహా సమావేశాలకు శ్రీకారం చుట్టివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments