Webdunia - Bharat's app for daily news and videos

Install App

279వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:01 IST)
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 279వ రోజుకు చేరుకున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నెలపాడు, ఆనంతవరం, నీరుకొండ తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. అమరావతిని ఆదుకోవాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై విషం చిమ్మితే పాలకులు  చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు.

భూములు ఇచ్చిన వారిపై ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని అందనంత అభివృద్ధి చేస్తామన్న వైసీపీ నాయకులు అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి అనేక మార్గాలు దొరుకుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments