Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురు మెడలో మూడుముళ్లు పడ్డాయి.. తండ్రి ప్రాణాలు విడిచాడు..

ఆ తండ్రి హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. తన కుమార్తె వివాహానికి బంధువులను ఆహ్వానించాడు. పెళ్లికూడా అనుకున్నట్లే జరుగుతోంది. అంతే పందిరిలో కూతురి మెడలో

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (10:11 IST)
ఆ తండ్రి హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. తన కుమార్తె వివాహానికి బంధువులను ఆహ్వానించాడు. పెళ్లికూడా అనుకున్నట్లే జరుగుతోంది. అంతే పందిరిలో కూతురి మెడలో పెళ్లికొడుకు మూడుముళ్లు వేసిన కొద్దిసేపటికే ఆకస్మికంగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలం ముత్యంపేట ఎస్సీ కాలనీకి చెందిన మల్యాల లచ్చయ్య, విజయల కుమార్తె రక్షణకు చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సంజీవ్‌తో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. వరుడు సంజీవ్‌ వధువు రక్షణ మెడలో మూడు ముళ్లు వేసిన కొద్దిసేపటికే లచ్చయ్య మృతి చెందాడు. దీంతో పెళ్లి జరిగిన ఇంట విషాధం నెలకొంది. కొన్ని నెలలుగా లచ్చయ్య హృద్రోగంతో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments