Webdunia - Bharat's app for daily news and videos

Install App

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (09:14 IST)
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు - కంటైనర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. కారులో ఉన్నవారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదంలో చిక్కుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. మృతులంతా చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
కాగా, రోడ్డు ప్రమదాం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ యు.వెంకటకుమార్, సీకె దిన్నె, సీై శంకర్ నాయక్ రామాపుర సీఐ వెంకట కొండారెడ్డిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments