Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వద్ద గోదావరి మహోగ్రరూపం

Webdunia
గురువారం, 14 జులై 2022 (09:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఏరులై ప్రవహిస్తున్నారు. వరద నీరు అనేక ప్రాంతాలను నీట ముంచేశాయి. ఈ వరద నీటి ప్రవాహంత గోదావరి నది మహోగ్రరూపం దాల్చుతుంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 15.37లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
 
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వరద 58.5 అడుగులకు చేరుకుంది.
 
బుధవారం ఉదయమే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. అయితే, సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం మరింతగా పెరిగిపోయింది. గోదావరి నదిలో వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీచేసింది. అయితే వరద తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
 
'సాయంత్రం నాటికి తీవ్రత తగ్గవచ్చు, కానీ ఇప్పటికీ హాని కలిగించే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి' అని అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments