Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తుఫాన్‌లో మరణించిన వారికి రూ. 5 లక్షలు: ఉపముఖ్యమంత్రి బాషా

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (17:38 IST)
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో వరదపై సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత బయటకు వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. మానవతా దృక్ఫథంతో అధికారులు పనిచేయాలని.. ఏ రైతు నష్టపోకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో డిసెంబర్ 15వ తేదీ లోగా ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. 
 
అలాగే నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారని, మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. వెంటనే బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా కడప జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన బుగ్గవంకను 39 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేసేందుకు సిఎం ఆమోదించారని, అలాగే పింఛా నది, అన్నమాచార్య ప్రాజెక్టుల ఎత్తును కూడా పెంచుతున్నట్లు చెప్పారు.
 
వరదలతో కొట్టుకుపోయిన రోడ్లను త్వరలో పునరుద్ధరిస్తామని, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపు పంట నష్టంపై నివేదికలను పరిశీలించిన తరువాత డిసెంబర్ 30లోగా బాధితులకు నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments