Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో నేపథ్యంలో ఈ అధికారులను బదిలీ చేసింది. కొత్త జిల్లాలకు పాలనాపరమైన సౌలభ్యం కోసం కొత్తగా కలెక్టర్లను నియమించింది. 
 
ఇందులోభాగంగా, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా అనుపమ అంజలి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనరుగా కె.దినేష్ కుమార్‌లను నియమించింది. 
 
అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తూ వచ్చిన టి.నిషాంతిని అక్కడ నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 
 
ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసి సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments