Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్ర‌హ్మంగారి మ‌ఠం స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం... న‌లుగురు మృతి!

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:35 IST)
కడప జిల్లా బద్వేలు, మైదుకూరు జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందారు.
 
బ్రహ్మంగారి మఠం డి.అగ్రహారం సమీపంలో టమోటా లోడు లారీ వేగంగా, మారుతి ఎర్టిగా కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్నఎనిమిది మందిలో నలుగురు మృతి చెందగా, ముగ్గరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం మొగల్కోట్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో సంవత్సరంలోపు చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. వీరంతా నెల్లూరు పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు మృత దేహాల్లో ఓ మహిళ ఇద్దరు పురుషులు కాగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ శబ్దానికి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్థుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ఆస్పత్రిలో ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments