Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి ఇవ్వలేదని తల్లికి కర్మకాండలు చేయని నలుగురు కుమారులు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (20:21 IST)
నేటికాలంలో చాలామంది మనుషులు ఆస్తిపాస్తులకు ఇచ్చే విలువ బంధాలకు, బంధుత్వాలకు ఇవ్వడం లేదు. ఈ సమాజంలో ఎవరూ లేని అనాధలుగా కొంతమంది మిగులుతుంటే ఇంకొంతమందైతే దిక్కుమొక్కులేనివారిగా చనిపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆస్తి కోసం కొడుకులు రెండురోజులుగా తల్లికి కర్మకాండలు చేయలేదు. 
 
రత్నమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు. అనారోగ్యంతో రత్నమ్మ భర్త నాగరాజు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈమె పేరు మీద రెండు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. పొలం మొత్తం రత్నమ్మ పేరు మీద ఉంది. నామిని ఎవరినీ పెట్టలేదు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడే నలుగురు కొడుకులు వచ్చి పొలాన్ని తమ పేర్ల మీద రాయాలని అడిగారు. 
 
అయితే ఇప్పుడు కాదు. తరువాత రాస్తానని రత్నమ్మ చెప్పింది. దీంతో కొడుకులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. రెండురోజుల క్రితం అనారోగ్యంతో రత్నమ్మ చనిపోయింది. విషయం కొడుకులకు తెలిసింది. కానీ ఆస్తి లేకపోవడంతో కర్మకాండలకు ఎవరూ ముందుకు రాలేదు. అనాధ శవంలా రెండురోజుల పాటు రత్నమ్మ మృతదేహాన్ని అలాగే ఉంచి ఆ తరువాత గ్రామస్తులే దహనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments