Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి శ్రీ శార్వరి నామ సంవత్సర భవానీ దీక్షలు.. దీక్ష నిబంధనలు ఇవే

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (11:02 IST)
విజయవాడ నందు ది.5.1.2021 నుండి ది.09.01.2021 వరకు నిర్వహించు భవానీ దీక్షలు – 2020ను పురస్కరించుకొని చేపట్టవలసిన వివిద రకముల నిర్వహణా ఏర్పాట్లు మరియు దీక్షల విరమణకు విచ్చేయు దీక్షాధారులకు,భక్తులకు కల్పించవలసిన మౌలిక వసతుల గురించి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరు క్యాంపు ఆఫీస్ నందు నిర్వహించిన సమన్వయ సమావేశము నందు కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా తీసుకొన్న ప్రాధమిక నిర్ణయములు : 
 
1) భవానీ దీక్షలు – 2020ను పురస్కరించుకొని దీక్షా విరమణలు ది.05.01.2021 నుండి ది.09.01.2021 వరకు శ్రీఅమ్మవారి దర్శనము ఉదయం 4-00 గం.ల నుండి రాత్రి 8-00 గం.ల వరకు కల్పించబడును.(మొదటి రోజు  (05-01-2021) న ఉదయం 05.30 గం. లకు దర్శనము ప్రారంభం)

2) శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు ప్రతి భక్తుడు ఆన్ లైను నందు టోకెన్ తప్పనిసరిగా తీసుకొని , టొకెన్ తో పాటు ఏదైనా ఐ.డి. ప్రూఫ్ తప్పని సరిగా తీసుకొనిరావలెను. లేనియెడల దర్శనమునకు అనుమతించబడదు. (website: www.kanakadurgamma.org , Mobile App: kanakadurgamma)

3) కరోనా నియంత్రణ దృష్ట్యా దర్శనమునకు వచ్చు ప్రతి భక్తుడు తప్పకుండా మాస్కు ధరించి స్వియ దూరము పాటించవలెను. 

4) కరోనా నిబంధనలు అనుసరించి శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చు 10 సంవత్సరములలోపు పిల్లలు, 65 సంవత్సరముల పైబడినవారు , దివ్యాంగులు, వృద్దులు, గర్బిణీ స్త్రీలు దర్శనమునకు అనుమతించబడరు.
 
5) అంతరాలయ దర్శనము పూర్తిగా నిలుపుదల చేయడమైనది. 

6) కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా దీక్షల విరమణల రోజులలో ఒక రోజుకు 10,000 మందికి మాత్రమే దర్శనమునకు అనుమతించుట. దీక్షాధారులకు 9,000 నెం. ఉచిత టికెట్లు, భక్తులకు రూ.100/-లు టికెట్లు 1,000నెం.ల చొప్పున విక్రయించి దర్శనమునకు అనుమతించుట.

7) ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా గిరి ప్రదక్షిణ నిలుపుదల చేయడమైనది.

8) కేశ ఖండన (తలనీలాలు సమర్పించుట) నిలుపుదల చేయడమైనది. 

9) నదీ స్నానములు మరియు జల్లు స్నానములు నిలుపుదల చేయడమైనది.

10) కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా దర్శనమునకు విచ్చేయు భక్తులు భౌతిక దూరం పాటించు విధముగా ప్రభుత్వము వారి ఆదేశముల ప్రకారము మరియు కరోనా నిబంధనలు ప్రమాణాలకు లోబడి క్యూ లైన్లు కెనాల్ రోడ్ , వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభం. 

11) దీక్ష స్వీకరించిన భక్తులు వారి యొక్క ఇరుముడులను దేవస్థానమునకు సమర్పించి తదుపరి మాలా విరమణను వారి వారి స్వగ్రామముల యందు గురు భవానీలచే మాల విరమణ చేసుకొనవలెను.

12) శ్రీ అమ్మవారి దర్శనార్ధమై విచ్చేయు భవానీ దీక్షాధారులు మరియు భక్తుల సౌకర్యార్ధం వివిధ ప్రాంతములలో అధిక సంఖ్యలో తాత్కాలిక మరుగు దొడ్లను ఏర్పాటు చేయుట.

13) జిల్లా వైద్యారోగ్య శాఖ వారి ఆధ్వర్యములో 5 ప్రదేశములలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేపట్టుట. 

14) శ్రీ అమ్మవారి ఉచిత ప్రసాదమును ఉదయం 6-00 గం.ల నుండి సాయంత్రం 6-00 గం.ల వరకు ప్యాకెట్ల రూపములో దీక్షాధారులు మరియు భక్తులకు వితరణ చేయుట.

15) సుమారు 10,00,000 సంఖ్యలో లడ్డూ ప్రసాదములను అందుబాటులో ఉంచుటకు చర్యలు తీసుకొనడమైనది. 

16) కనకదుర్గనగర్ నందు ప్రసాద విక్రయ కేంద్రముల వద్ద భౌతిక దూరం పాటించు విధముగా ప్రసాదము కౌంటర్లు  ఏర్పాటు చేయడమైనది. 

17) భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువ భాగమున మహామండపము వద్ద ఇరుముడి పాయింట్లు మరియు హోమగుండములు ఏర్పాటు చేయడమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments