Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావి వద్దకు వెళ్లిన యువతిపై అత్యాచారం.. హత్య

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:59 IST)
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామచంద్రాపురంలో గ్రామానికి చెందిన కురా మహంతి, రాధామణిల కుమార్తె కనకలత (22). మహంతి వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కనకలత, విద్యా వలంటీర్‌గా పనిచేస్తోంది. నిత్యమూ ఊరు బయట ఉన్న బావి వద్దకు వెళ్లి స్నానం చేసి రావడం కనకలత, రాధామణిలకు అలవాటు. 
 
శనివారం మాత్రం కనకలత ఒంటరిగా స్నానానికి వెళ్లి, బకెట్ం దుస్తులు రహదారిపై ఉంచి, పక్కనే ఉన్న ఓ తోటలోకి బహిర్భూమి నిమిత్తం వెళ్లింది. ఆమె దుస్తులు చాలా సేపు రోడ్డుపైనే ఉండటంతో స్థానికులు తోటలోకి వెళ్లి చూడగా, ఆక్కడ కనకలత మృతదేహం లభించింది. 
 
ఆమె మెడకు ఓ టవల్‌ను గట్టిగా బిగించి హత్య చేసినట్టు కనిపించగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్‌తో పాటు పోలీసు జాగిలాలను పిలిపించి పరిసరాలు గాలించారు. హత్యానేరంగా కేసును నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments