Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం హత్యకు కారణమైంది.. భార్యను చేతబడి చేసి చంపేశాడని?

Webdunia
సోమవారం, 20 మే 2019 (11:31 IST)
అనుమానం ఓ హత్యకు దారితీసింది. చేతబడి చేసి తన భార్యను చంపేశాడని కక్ష పెంచుకున్న వ్యక్తి అదను చూసి ఓ వృద్ధుడిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండం బొడ్డుగూడెంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బొడ్డుగూడెంలో గ్రామానికి చెందిన సొంది భద్రయ్య భార్య సొంది గంగమ్మ గత నెల 16వ తేదీన మృతిచెందింది. గ్రామానికి చెందిన తాటి కన్నయ్య (60) చేతబడి చేయడం వల్లే తన భార్య చనిపోయిందని భద్రయ్య అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో కన్నయ్యను చంపేయాలని నిర్ణయించి నాగరాజు అనే స్నేహితుడి సాయం కోరాడు.
 
ఇద్దరు కూడబలుక్కుని ఈనె 6వ తేదీన పనివుంది రావాలంటూ కన్నయ్యను ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన కన్నయ్యను ఒకరు కాళ్లు పట్టుకోగా మరొకరు గొంతు నులిమి చంపేశారు. 
 
అనంతరం శవాన్ని పులివాగులోని ఇసుకలో పాతిపెట్టేశారు. కొద్దిరోజులకు మృతదేహం బయటకు తేలడంతో ఈనెల 13న స్థానిక వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో కన్నయ్యను భద్రయ్య, నాగరాజు హతమార్చారని తేలడంలో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments