Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీనగర్ వద్ద వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:38 IST)
విశాఖపట్టణం - హైదరాబాదా ప్రాంతాల మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్  బీబీనగర్ వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడలేదు. ఈ ఘటనలో మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైలు పట్టాలు తప్పడం కారణంగా వచ్చిన భారీ శబ్దానికి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణం స్పందించి హెల్ప్ లైన్ నంబరు 040-2778 6666 ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments