Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కింది.. ఎక్కడ?

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జగ్గరాజు చెరువులో చేపల కోసం చాలామంది వల

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:55 IST)
చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జగ్గరాజు చెరువులో చేపల కోసం చాలామంది వలలు విసురుతున్నారు. ఇందులో భాగంగా పెదరాయవరం గ్రామానికి చెందిన పీతల చిట్టిబాబు కూడా చేపల కోసం ఈ చెరువులో వల విసిరాడు.
 
ఆపై వలను లాగడం. చిట్టిబాబు తరం కాలేదు. వలలో పెద్ద చేప చిక్కుకుపోయిందని.. అందరినీ పిలిచాడు. దాన్ని అతికష్టం మీద బయటికి లాగే సరికి  వారి గుండె ఝల్లుమంది. తీరా చూస్తే.. వలలో చేపకు బదులు కొండచిలువ చిక్కుకుంది. దాన్ని బయటకు తీయడం వారి వల్ల కాకపోవడంతో... చివరకు గునపాలతో పొడిచి చంపేశారు. అనంతరం ఈ కొండచిలువను పెదరాయవరం ఎస్సీ పేటకు తరలించారు. 
 
ఈ సందర్భంగా దాన్ని చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, నీటి ప్రవాహంలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి వలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments