Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు షాకిచ్చిన నరసింహన్... కొత్త బిల్లుకు బ్రేక్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తేరుకోలేనిషాకిచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మున్సిపాలిటీ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. ఈ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ తిప్పిపంపారు. పైగా, ఈ బిల్లును కేంద్రానికి పంపాలని ఆయన నిర్ణయించారు. 
 
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కొత్త మున్సిపాలిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కొత్త మునిసిపల్ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఆయన, కొన్ని సవరణలు చేయాలని సూచించారు. 
 
ఈ బిల్లును కేంద్రానికి పంపాలని నిర్ణయిస్తూ, దాన్ని రిజర్వ్ లో ఉంచినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం మునిసిపల్ బిల్లుపై ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments