Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:45 IST)
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనను విడుదల చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
 
ఆదివారం గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చందన్న కానుకల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, శ్రీనివాస్‌కు రిమాండ్ విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. ఆ తర్వాత రూ.25 వేల పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం