Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది.. మళ్లీ ఛలో హైదరాబాదా? జీవీఎల్ ప్రశ్నలు

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (10:49 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నదని, ఆ పదేళ్లకాలంలో ఒక్కటంటే ఒక్క రోజును కూడా రాజధానిని ఉపయోగించుకున్న దాఖలాలు లేవని, ఇపుడు మళ్లీ ఛలో హైదరాబాద్ అంటూ కొత్త రాగం అందుకోవడం విచిత్రంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. 
 
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఇంకొన్నాళ్లు కొనసాగించాలని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు జూన్‌తో ముగియనుంది. నాటి టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ సర్కారు హైదరాబాదులోని కార్యాలయాలన్నింటినీ తెలంగాణ సర్కారుకు అప్పగించింది. తదనంతరం, ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించింది. ఇప్పుడు వైవీ వ్యాఖ్యలతో మరోసారి హైదరాబాద్ రాజధాని అంశం తెరపైకి వచ్చిందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని బీజేపీ చెబుతోందన్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి అని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రం నుంచి రాజధానిని తీసుకోవాల్సిన అగత్యం ఏపీకి లేదని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఇస్తే దాన్ని ఒక్క రోజు కూడా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు... మళ్లీ ఛలో హైదరాబాద్ అని ఎందుకంటున్నారని జీవీఎల్ విమర్శించారు. సొంత రాజధాని నిర్మించుకోలేకపోయిందన్న అప్రదిష్ట ఏపీకి ఎందుకు? మళ్లీ వెళ్లి పక్క రాష్ట్రంపై ఆధారపడతామనడం సబబేనా? అని జీవీఎల్ నరసింహా రావు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments