Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDManOfMassesYSJagan : నగరిలో టెన్షన్... టెన్షన్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను అధికార వైకాపా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా, వైకాపా కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా ఒకరు. ఈమె కూడా తన సొంత నియోజకవర్గంలో వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, నగరిలో వైకాపా శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీంతో ఇక్కడ పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా పెద్ద ఘర్షణ వాతావరణమే నెలకొంటుంది. తాజాగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇదే జరిగింది. 
 
ఎమ్మెల్యే రోజాతో పాటు ఆమె వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్ పుట్టిన రోజు వేడుకలు చేయడానికి సిద్ధమయ్యారు. నగరిలో రోజా పదివేల మందితో భారీ ర్యాలీకి సిద్ధంకాగా, రోజా వ్యతిరేకవర్గం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంతే ధీటుగా ర్యాలీకి సిద్ధమైంది. దీంతో పార్టీకి చెందిన కిందిస్థాయి కేడర్, కార్యకర్తలు ఎవరి వైపు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 
 
సోమవారం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ నగరి పట్టణంలోని ప్రధాన సెంటరులో కట్టిన ఫ్లెక్సీని చింపివేయడంతో రెండు వర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో నగరి పట్టణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతను పెంచి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments