Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం రణస్థలి వేదికగా జనసేన 'యువశక్తి' సభ

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:42 IST)
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ యువసభను జరుపుతున్నారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం జిల్లాలోని లావేరు మండలం తాళ్ళవలస సమీపంలో 25 ఎకరాల్లో భారీ ప్రాంగణంలో వేదికను సిద్ధం చేశారు. అలాగే వేదికపై పవన్‌‍తో పాటు వంది మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్ రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 
 
ఈ యువశక్తి సభ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. ఇందులో వంది మంది యువకులు ప్రసంగిస్తారు. సభ ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేస్తారు. ముఖ్యంగా, రెండు రాజకీయ తీర్మానాలు చేస్తారు. అలాగే, టీడీపీ జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీంతో వైకాపా నేతలు విపక్ష నేతలను కట్టడి చేసేందుకు బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని తెరపైకి తెచ్చి జీవో నంబర్ 1ని విడుదల చేసింది.
 
అలాగే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మన జాతి భవిష్యత్ మీదే.. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. "నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసివున్న పోస్టరును ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments