Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:45 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు, తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే, వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో సోమవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. 
 
అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments