Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడురోజులపాటు భారీ వర్షాలు... అల్పపీడన ప్రభావం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (16:21 IST)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తీవ్రంగా కనబడుతున్నది. అల్పపీడన వ్రభావం వలన ఇప్పటికే కోస్తా రాయలసీమ జిల్లాలలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవి మరింత తీవ్రమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
రాబోయే మూడు రోజులకు భారీ వర్షాలు తప్పవని అధికారులు ప్రకటించారు. వాయువ్య బంగాళాఖాతంలో రేపు పూర్తి స్థాయిలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముందని తెలిపింది.
 
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో అధిక వర్షపాతానికి అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments