Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులూ మీరు గుర్తున్నారు: అచ్చెం నాయుడు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (22:15 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పోలీసులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జాగీరుల్లా మారిపోయారని మండిపడ్డారు. కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ప్రతిపక్షపార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్లు అక్రమ కేసులను బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
తిరుపతిలో ఈరోజు ధర్మపరిరక్షణ పేరుతో యాత్రను చేపట్టారు అచ్చెం నాయుడు. అయితే టిడిపి నేతలను యాత్ర చేయనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అచ్చెంనాయుడును హోటల్ లోనే నిర్బంధించారు. కార్యక్రమానికి బయలుదేరిన టిడిపి నేతలను అడ్డుకున్నారు. 
 
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ అరెస్టులు చేసేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రానికి నేతలను విడిచిపెట్టారు. అయితే అచ్చెమనాయుడు మాత్రం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కావాలనే తమపై కేసులు పెడుతున్నారన్నారు. 
 
తమపై కేసులు పెట్టే ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా గుర్తించుకుంటామని.. అలాంటి వారిపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పదవీ విరమణ చేసేస్తాం.. ఇక మనం వెళ్ళిపోతాం.. మనల్ని ఏమీ చేయలేరులే అనుకుంటే పొరపాటే.. టిడిపి కార్యకర్తలను ఏ పోలీసు అధికారి ఇబ్బందులకు గురిచేసినా వదిలిపెట్టేది లేదన్నారు అచ్చెమనాయుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments