Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవులు వాయిదా వేసుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కారణం?!

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:07 IST)
గతంలో తాను పెట్టిన సెలవులను వాయిదా వేసుకున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెలవుపెట్టుకున్నారు నిమ్మగడ్డ రమేష్.

అయితే, ఈ నెల 18వ తేదీన మేయర్‌, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియలో తన అవసరం ఉందని భావిస్తున్నానంటూ తాజాగా రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.

మేయర్, ఛైర్మన్‌ ఎంపిక ప్రక్రియ కారణంగా సెలవులు వాయిదా వేసుకుంటున్నట్టు వెల్లడించిన ఆయన.. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు సెలవులపై మధురై, రామేశ్వరం వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్‌.. ఆ తర్వాత మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించింది.

ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఇక, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ల ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments