Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (09:47 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో కోఆర్డినేటర్‌గా చేరారు. పైగా, తన కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్ గారూ అంటూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. అక్కడ ఆమె ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు.
 
అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయో ఆమె పెట్టుబడిదారులకు వివ‌రించారు. ఈ విష‌యాలని కేటీఆర్‌కి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. 'నా జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌గారు' అని అడిగింది. 
 
దీనికి కేటీఆర్ స్పందించారు. 'నీకు ధన్యావాదాలు ఉపాసన. మా టీం స్థైర్యాన్ని పెంచినందుకు ఆనందంగా ఉంద‌'ని కామెంట్ పెట్టారు. డెస్క్‌లో ప‌ని చేసిన ఫోటోల‌ని కూడా ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments