Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కూర సరిగా వండలేదని భర్త ఆత్మహత్య.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (15:03 IST)
భార్యాభర్తల గొడవలు సామాన్యమే. అయితే ఇక్కడో వ్యక్తి భార్యతో గొడవకు దిగాడు. కూర సరిగ్గా వండలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పిండివారిపాలెంకు చెందిన చింతల తిరుమలరావుకు రెండేళ్ల క్రితం నిర్మల జ్యోతితో పెళ్లైంది. వీరికి ఎనిమిది నెలల పాప కూడా ఉంది.

ఇదిలా ఉంటే గురువారం ఉదయం కూర సరిగా వండలేదన్న నెపంతో భార్యతో గొడవపడ్డాడు. ఈ కాసేపు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
 
ఆ తర్వాత పెడనలోని ఒకటవ వార్డులో ఉన్న అతడి స్నేహితుడు గోపీ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుమలరావును స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడ్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
చిన్నపాటి కారణానికే ఆత్మహత్య చేసుకోవడంపై తిరుమలరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఐతే ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కూరవిషయమే కారణమా.. లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments