Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసుకున్న భార్య.. అగ్గిపుల్ల గీసి నిప్పంటించిన భర్త.. ఎక్కడ?

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలపై కూర్చొన్నారు.కానీ అనుమానం పెనుభూతమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (13:51 IST)
ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలపై కూర్చొన్నారు.కానీ అనుమానం పెనుభూతమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనను అనుమానించడంతో ఆ మహిళ తట్టుకోలేక పోయింది. దీంతో భర్తను బెదిరించే నిమిత్తం శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ, పాషాణ హృదయుడైన భర్త.. ఏకంగా అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఒంగోలు జిల్లా ఊపూరుపాలెం దగ్గర గల తోటవారిపాలెంకు చెందిన బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న బాపట్ల ప్రశాంతి కుమారి (25)కి బేల్దార్‌ పని చేసే సింగరాయకొండకు చెందిన బాపట్ల అశోక్‌ కుమార్‌కు రైలులో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు.
 
వీరిద్దరు ఉపాధి నిమిత్తం రాజధాని ప్రాంతం తుళ్ళూరుకు రెండేళ్ల క్రితం వచ్చారు. వెంకటపాలెంలో కాపురం ఉంటూ అశోక్‌బాబు బేల్దారి పనులకు వెళుతుండగా ప్రశాంతి ఇంటి వద్దే ఉంటోంది. వీరికి రెండున్నర ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు భార్యపై అనుమానం కలిగింది. ఇది తెలిసిన ప్రశాంతి నన్నే అనుమానిస్తావా? అంటూ శరీరంపై కిరోసిన్‌ పోసుకుంది.
 
అప్పటికే భార్యపై ఆగ్రహంతో ఉన్న భర్త.. అగ్గిపుల్ల గీసి ఆమెపై వేశాడు. దీంతో శరీరమంతా మంటలు వ్యాపించడంతో ఆమె బాగా కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన భర్తే అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడని పేర్కొంది. శరీరం మూడొంతులు కాలిపోవటంతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఆమె మృతి చెందింది. హత్య కేసుగా నమోదు చేసి తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments