Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ వండటం చేతకాదని.. భార్యను పుట్టింటికి పంపించాడు

బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. అయితే భర్త ఇంటిముందు న్యాయం కోసం భార్య మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వ

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (10:36 IST)
బిర్యానీ వండటం చేతకాదనే సాకుతో పెళ్లైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. అయితే భర్త ఇంటిముందు న్యాయం కోసం భార్య మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్‌కు ఖాజిపేటదర్గాకు చెందిన మానసతో 2016 నవంబర్‌లో వివాహం జరిగింది. రాజేంద్రపసాద్‌కు కట్నంగా రూ.7లక్షలిచ్చారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ.. రోజూ తాగి వచ్చే రాజేంద్రప్రసాద్ బిర్యానీ వండటం రాదనే నెపంతో రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు. 
 
పది నెలలు గడిచినా తీసుకెళ్లేందుకు రాకపోవడంతో బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.  తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి నుంచి కదిలేదిలేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోజూ తాగొచ్చి కొట్టేవాడని.. ఇలా కొట్టీ కొట్టీ చేయి కూడా వంకరపోయిందని.. బయటి తిండికి అలవాటు పడి రోజూ బిర్యానీ చేయాలని వేధించే వాడని బాధితురాలు పోలీసులతో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments