Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్‌లో విజయం ఎవరిది? రికార్డు స్థాయిలో పోలింగ్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (20:43 IST)
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి గమనించినట్లయితే ప్రతీ రెండు గంటలకు 7.60 శాతం ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. 
 
ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. సాయంత్రం ఏడు గంటల వరకు బూత్ లోపల క్యూలైన్లలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. 
 
దీంతో ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
టీఆర్ఎస్ వ్యతిరేక ట్రెండ్ వల్లే ఓటింగ్ పెరిగిందని బీజేపీ నేతలు చెబుతుండగా, ఈటలను ఓడించడానికే జనం పెద్ద ఎత్తున ఓట్లేస్తున్నారని గులాబీ నేతలు అంటున్నారు. దీంతో ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎవరిది విజయమనేది ఈనెల 2న తేలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments