Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనీ... 5 అంతస్తుల భవనంపై నుంచి...

నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం.

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:16 IST)
నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. ఇంటర్‌లో 1150 పైచిలుకు మార్కులు సాధించినప్పటికీ.. నీట్ పరీక్షలో అర్హత సాధించలేక పోయారు. ఫలితంగా బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
హైదరాబాద్ నగరం అబిడ్స్‌లోని మయూరీ కాంప్లెక్స్‌ ఐదో అంతస్తు నుంచి ఓ యువతి దూకేసింది. తొలుత ఈ యువతి ఎవరన్నది గుర్తించలేక పోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
అనంతరం ఆ అమ్మాయి ఎవరు? ఎందుకీ ఘటనకు పాల్పడిందన్న విషయాలను పోలీసులు సేకరించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18)గా గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments