Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క... ప్రాణం తీసింది.. ఎలా?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఓ విషాదం జరిగింది. చికెన్ ముక్క ఒకటి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. హైదరాబాద్, చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నిర్మల, కుమారస

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (10:51 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఓ విషాదం జరిగింది. చికెన్ ముక్క ఒకటి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అదెలాగంటారా? అయితే, ఈ కథనం చదవండి. హైదరాబాద్, చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నిర్మల, కుమారస్వామి (48) అనే దంపతులు నివశిస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో కుమార స్వామి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈనెల 16న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. 
 
చికెన్ కూరతో చపాతీ తింటుండగా ఒక్కసారిగా చికెన్ ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగిన ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చికెన్ ముక్కను వెలికి తీసేందుకు నిర్మల నానా విధాలుగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించక పోవడంతో 108 ఆంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కుమార స్వామిని పరిశీలించిన వైద్యులు... అత్యవసరంగా ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను తొలగించారు. గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను వైద్యులు బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో కుమారస్వామి మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments