Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని కసాయిగా మారిన కన్నతల్లి(వీడియో)

కట్టుకున్న భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఆ విషయాన్ని భర్తకు పిల్లలు ఎక్కడ చెప్పేస్తారేమోనని అతి దారుణంగా చంపేసింది. కన్నతల్లి ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి చంపేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగిన ఈ సంఘటన తీవ్

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (16:17 IST)
కట్టుకున్న భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఆ విషయాన్ని భర్తకు పిల్లలు ఎక్కడ చెప్పేస్తారేమోనని అతి దారుణంగా చంపేసింది. కన్నతల్లి ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి చంపేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 
 
ఇద్దరు బిడ్డలను హత్య చేసిన ఆ తల్లి పరారైంది. రామకుప్పం మండల పరిధి పంద్యాలమడుగు పంచాయతీ కవ్వంపల్లె గ్రామానికి చెందిన పవిత్రకు వేమారెడ్డికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి రుత్విక్ రెడ్డి, ధనుష్‌ రెడ్డి ఇద్దరు పిల్లలున్నారు. ఎప్పటిలాగే వేమారెడ్డి పొలం పనులకు వెళ్ళాడు. 
 
ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య పవిత్ర కనిపించలేదు. దీంతో పవిత్రే ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం చిన్నారుల మృతికి కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియో...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments