Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (17:37 IST)
వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తర ఒరిస్సాతో పాటు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపై అల్పపడీన ప్రాంతం ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదేసమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెన 18వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. 
 
ఐఎండీ సూచన మేరకు.. జూలై 17 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూలై 18 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జూలై 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
జూలై 16 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా కొత్తపల్లెలో 11 సెంటీమీటర్లు, చెన్నూరులో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments