Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం సక్సెస్... ఐదేళ్లపాటు సేవలు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (15:51 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. స్వదేశీ ఉపగ్రహం రీశాట్-2తో పాటు.. విదేశాలకు చెందిన మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. రీశాట్-2 628 కేజీలుగా ఉంది. అలాగే, అమెరికాకు చెందిన ఆరు శాటిలైట్స్, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ48 నింగిలోకి మోసుకెళ్లింది. 
 
సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ‘రీశాట్‌-2బీఆర్‌1’ ప్రయోగాన్ని నిర్వహించారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కావడం మరో విశేషం. 
 
మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్ళపాటు ఇది సేవలు అందించనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments