Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు వాహన మిత్ర నిధుల విడుదల - విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంకు వెళుతున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటైన వాహన మిత్ర నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వెళుతున్నారు. 
 
నిజానికి ఆయన ఈ నెల 13వ తేదీనే విశాఖకు వెళ్లాల్సివుంది. కానీ, వర్షాల కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో విశాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటనలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్దిదారుల ఖాతాల్లో ఈ యేడాది నిధులను ఆయన జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు యేడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద మొత్తం రూ.261 కోట్లను జమ చేస్తారు. 
 
మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేసి ఆ తర్వాత లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments