Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు జగన్ - ఇటు కెసిఆర్ ఇరుక్కున్న బాబు... ఎలా?

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (12:33 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రబీలో రూ.4 వేలు, ఖరీఫ్‌‌లో రూ.4 వేలు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. దీనివల్ల 58 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. 
 
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి యేడాది క్రితం ప్రకటించిన నవరత్నాలు పథకాల్లోనూ ఇదే ఉంది. పంటల సాగు కోసం యేడాదికి రూ.12 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతలోనే కెసిఆర్ పథకాన్ని ఆచరణలో పెట్టారు. వాస్తవంగా రైతులు పంటల సాగుకు పెట్టుబడులు దొరక్క అప్పుల పాలవుతున్నారు. స్వామినాథన్ వంటి వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయానికి పెట్టుబడులు ప్రభుత్వమే సమకూర్చాలని సిఫార్సు చేశారు. దీన్ని కెసిఆర్ ఆచరణలోకి తేవడం అభినందించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారనేది తరువాత అంశం.
 
ఇప్పుడు చంద్రబాబుకు సమస్య వచ్చిపడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ రైతులకూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందట. రుణమాఫీ అనేది ఒక యేడాదికి సంబంధించినది. ఐతే రైతు బంధు అనేది రైతుల వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేది. మరి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments