Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (19:23 IST)
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి దేశ న్యాయవ్యవస్థలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్, పదవీ విరమణ పొందనున్న తరుణంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ప్రత్యేక విమానంలో దేశ రాజధాని నుండి శ‌నివారం సాయంత్రం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు సంభందించిన న్యాయమూర్తులు, పరిపాలన అధికారులు సీజేఐ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి బయలుదేరిన ఆయన ముందుగా తిరుచానూరు ఆలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో సిజేఐ దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం పండితులు ఆశీస్సులు అందజేయగా టిటిడి జేఈఓ బసంత్ కుమార్ సీజేఐ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం శ్రీవారి దర్శనార్థం భారీ భద్రత నడుమ రోడ్డు మార్గంలో సీజేఐ తిరుమలకు బయలుదేరి శ్రీపద్మావతి అతిధిగృహం వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి సీజేఐ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకగా, భద్రతా సిబ్బంది గౌరవ వందనం చేసారు. ఇవాళ‌ రాత్రి అతిధిగృహంలో బస చేసి ఆదివారం ఉదయం సీజేఐ దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments