Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనాడు విలేఖరిపై విచారణ జరిపించాలని క‌డియం గ్రామ‌స్తుల‌ ధర్నా

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:21 IST)
ఆధార్ కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న ఈనాడు విలేఖరి దుప్పలపూడి శ్రీనివాస్ పై విచారణ జరిపించాలని కడియం మండలానికి చెందిన పలు గ్రామాల భాదితులు సోమవారం ఆందోళన చేశారు. కడియంలో ర్యాలీగా బయలుదేరి తాహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆధార్ కేంద్రానికి వచ్చిన నిరుపేదలను ఈనాడు విలేఖరి దోపిడీ చేస్తున్నాడని, దళిత గిరిజన పోరాట సమితి వ్యవస్థాపకుడు, న్యాయవాది చింతపర్తి రాంబాబు అన్నారు. అతనిపై చర్య తీసుకోవాల‌ని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దుప్పలపూడి శ్రీనివాస్ పై రాజానగరం పోలీస్ స్టేషన్ లో చీటింగ్, మోసం(420,506) కేసు నమోదయింద‌ని, ఆ కేసుల్లో పోలీసులు అరెస్టు కూడాఆ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ కేసు కోర్ట్ లో పెండింగ్ లో ఉంద‌ని రాంబాబు వెల్లడించారు. యూనియన్ బ్యాంకు ఆధార్ కేంద్రంపై ఎసీబీ అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం డిప్యూటీ తశీల్దార్ కె. శ్రీదేవి కి నిరసనకారులంతా వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దుళ్ళ, వేమగిరి, వీరవరం, దామిరెడ్డిపల్లి, కడియం, కడియపులంక, జేగురుపాడు, కడియపుసావరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments